ఆమె సక్సెస్ కే కాదు…ఫిట్ నెస్ కి కేరాఫ్ అడ్రస్. హీరోయిన్ గా ఢిపరెంట్ క్యారెక్టర్స్ చేయటానికి ఇష్టపడే ఈ పంజాబీ భామ..రీల్ లైప్ లోనే కాదు రియల్ లైఫ్ లో డిఫరెంట్ గా వుండటానికే ఇష్టపడుతుంది. ప్రేక్షకులకి ముందు బొద్దుగా కనిపించిన ఈ భామ…సడెన్ గా సన్నజాజి తీగ కి సిస్టర్ లా మారిపోయింది. పోనీలే ఏదో జీర్ సైజ్ అని ఆమె ప్యాన్స్ సర్దుకున్నారు. ఇప్పుడు ఈ భామ ఫ్యాన్స్ తో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీకి షా..క్ ఇచ్చింది.తన రూపు రేఖలను మార్చుకుంది అందం, అభినయం కలిసిన తార రకుల్ ప్రీత్ సింగ్. ఫిల్మ్ ఇండస్ట్రీలో అందానికి వుండే క్రేజే వేరు. అందుకు చాలా మంది హీరోయిన్స్ తమ అందంతోనే రాణిస్తున్నారు. అందం, అభినయం వున్న తారాలు కూడా వున్నారు. వారిని సినిమా ప్రేక్షకులు విపరీతంగా అభిమానిస్తారు. ఇలా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటిస్టూ తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఎప్పుడు ప్రేక్షకుల అందంగా కనిపించటం కోసం ఎక్కవగా కసరత్తులు చేస్తూ వుంటుంది.

రకుల్ కి సొంతం గా ఓ జిమ్ సెంటర్ కూడా వుంది. వరుస పెట్టి బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న ఈ తార తీసుకున్న ఓ నిర్ణయం అందరికి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. తన అందాన్ని రెట్టింపు చేసుకోవటానికి రకుల్ ప్రీత్ సింగ్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. బ్యూటీడాల్గా దూసుకుపోతున్న రకుల్ కి ఏమైందో ఏమో కానీ తన అందాన్ని రెట్టింపు చేసుకోవాలని అనుకుంది. అందుకోసం తన శరీరంలోని ఒక భాగానికి చిన్న మార్పులు చేయించుకుంది. రకుల్ లెటెస్ట్ పోటోలు చూస్తే అర్ధమైపోతుంది.రకుల్ తన పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని. తన పెదవులు బెటర్ లుక్ కోసం రకుల్ ఇలా చేసిందని ఫిల్మ్ ఇండస్ట్రీ టాక్. సహజంగా హీరోయిన్స్ అందం పెదవుల్లోనే వుంటుందని అనుకుంటారు. రకుల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. రీసెంట్ ఆమె షేర్ చేసిన ఓ ఫోటో చూస్తే రకుల్ న్యూలుక్లో కనిపించింది. ఈ పోటో చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది రకుల్ తన పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని. ఈ పంజాబీ బ్యూటీ ముఖంలో మార్పులు చాలా స్పష్టంగా కనబడతున్నాయి..

హీరోయిన్స్ అందంగా కనిపించటం రకరకాల టిప్స్ ఫాలో అవుతుంటారు.. అతిలోక సుందరి శ్రీదేవి తన ముక్కుకి ఆపరేషన్ చేయించుకుంది. పెదవులు అందంగా చక్కగా వుండేలా చేయించుకునే ఆపరేషన్ ని పౌట్ అంటారు. బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్స్ ఈ విధానంలో తమ అందాన్ని రెట్టింపు చేసుకుంటూ వుంటారు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా పౌట్ ఆపరేషన్ చేయించుకుంది. అయితే ఇప్పటి వరకు రకుల్ ప్రీత్ సింగ్ అఫిషియల్ ఈ విషయం పై స్పందించలేదు.ప్రజెంట్ రకుల్ నటించిన కొండపొలం అక్టోబర్ నెలలో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో మరో కొత్త సినిమాకి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. రకుల్ బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. బాలీవుడ్ లో రకుల్ నటించిన ఎటాక్, మేడే, థాంక్ గాడ్, డాక్టర్ జీ విడుదలకి సిద్దంగా వున్నాయి.